mahesh babu rajamouli latest news

Written by 24 News Way

Published on:

mahesh babu rajamouli latest news : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29వ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నారు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు 1500 కోట్లు భారీ బడ్జెట్ తో దుర్గ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాల కన్నా దీటుగా దీన్ని రాజమౌళి తీయాలనుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి. ఇప్పుడు తీయబోయే మూవీ కి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కృష్ణ గట్టిగా చెప్పిన వినలేదు.

ఇటువంటి ప్రచారం నిర్వహించకుండా మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ లు ప్రారంభించారు.   మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు. ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులు అందరికీ చేసి చూపిస్తాడు. యాక్షన్ సన్నివేశాలు అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా సొంతంగా ఆయనే  నటిస్తారు. ఇలా చేయడం వల్ల మహేష్ వాళ్ళ నాన్నగారు ఇలా చేయొద్దని చాలాసార్లు హెచ్చరించారు. అయినా తన అలవాటును మార్చుకోలేదు మహేష్ బాబు ఇలాంటి సన్నివేశాలని చేసేటప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే అభిమానులకు బాధ కలుగుతుంది. దానికోసం పనిచేసే నటులకు ఇబ్బంది అవుతుంది. సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. షూటింగ్ కూడా అంతరాయం కలుగుతుందని చెప్పేవారు.

భవనం మీద నుంచి తానే దూకేశాడు

mahesh babu rajamouli latest news :  సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనానికి డూప్ లేకుండా మహేష్ దొరికాడు ఇటువంటివి. రాజమౌళి దృష్టిలో ఉంచుకొని మహేష్ కు గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు. ఇటువంటివన్నీ మానుకోవాలని కొన్ని సన్నివేశాలు డూపులను పెట్టకు తప్పదని నేనే నటిస్తానంటూ మొండిపట్టు పట్టొద్దు గట్టిగా చెప్పేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా మహేష్ బాబు దీనికి ఓకే చెప్పారు.

Read More>>

🔴Related Post